- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: జార్ఖండ్ లో గురువారం భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. ఆ రాష్ట్ర డీజీపీ తదాషా మిస్త్రీ ఎదుట ఆయుధాలతో లొంగిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. 2026లో రాష్ట్రంలో 22 మంది మావోయిస్టులను మృతి చెందగా.. 44 మందిని అరెస్టు చేసినట్లు డీజీపీ వెల్లడించారు. 29 మంది లొంగిపోయారన్నారు. మిగిలినవారు జనజీవన స్రవంతిలోకి చేరినట్లు పేర్కొన్నారు. ఇవాళ లొంగిపోయిన 27 మందికి పునరావాసం కల్పిస్తామని అధికారులు వెల్లడించారు. తాజాగా లొంగిపోయిన వారిలో ఆయన సన్నిహిత బృందంలోని టాప్ కమాండర్లు, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు, ఏరియా కమిటీ సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది.
- Advertisement -



