- Advertisement -
నవతెలంగాణ – మర్రిగూడ
భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను గురువారం మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ శ్రేణులు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు రాందాస్ శ్రీనివాస్, సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, మాజీ ఎంపీపీలు, జడ్పిటిసిలు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, మాల్ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు, వార్డ్ మెంబర్లు, కాంగ్రెస్ మండల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



