సీపీఐ(ఎం) వ్యవస్థాపక సభ్యులు ఉద్ధరాజు రామం కుమారుడునివాళ్లర్పించిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, కేంద్ర కమిటీ సభ్యులు ఎస్. వీరయ్య
నవతెలంగాణ-నిజాంపేట్
సీపీఐ(ఎం) వ్యవస్థాపక సభ్యులు ఉద్ధరాజు రామం కుమారుడు.. కార్మిక నాయకులు ఉద్ధరాజు బాపిరాజు(80) బుధవారం రాత్రి హైదరాబాద్లోని బాచుపల్లిలో అనారోగ్యంతో మరణించారు. బాపిరాజు భౌతిక కాయానికి గురువారం ఉదయం సీపీఐ(ఎం) రాష్ట్ర కార్య దర్శి జాన్ వెస్లీ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ నాయ కులు డిజి.నరసింహారావు, మేడ్చల్ జిల్లా కార్య దర్శి పి.సత్యం, నాయకులు రాథోడ్ సంతోష్, పార్టీ బాచుపల్లి మండల నాయకులు ఆర్. శ్రీరాములు, బాల వెంకటేశ్వరరావు, నాగభూ షణం, బి.ఎన్ సుదర్శన్, శ్రీమన్నారా యణ, శివ ప్రసాద్, వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. బాపిరాజు కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా జాన్వెస్లీ మాట్లాడుతూ.. బాపిరాజు మరణం ఉద్యమానికి తీరని లోటన్నారు. రాష్ట్ర కమిటీ తరఫున ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తున్నామన్నారు. ఉద్ధ రాజు రామం వారసత్వాన్ని కొనసాగిస్తూ బాపి రాజు చివరి వరకు ఉద్యమంతో మమేకమై పనిచేశారని కొనియాడారు. ఉద్యమ చరిత్రకు ఉపయోగపడే ఫొటోలు, లేఖలు, పుస్తకాలను సేకరించడం గొప్ప సేవ అని గుర్తు చేశారు. ఆ పత్రాలను పార్టీ రాష్ట్ర కమిటీ ఉద్యమ అవసరాలకు వినియోగిస్తోందని తెలిపారు.
చివరి వరకూ బాపిరాజు సేవలు
ఉద్ధరాజు బాపిరాజుకు భార్య, ఇద్దరు పిల్లలు, మనుమళ్లు, మనుమరాళ్లు ఉన్నారు. ఆయన బయోలాజికల్ లో 10 ఏండ్లపాటు పని చేశారు. అనంతరం మిథాని పరిశ్రమలో 1980 నుంచి విధులు నిర్వహించారు. 2006లో ఉద్యోగ విరమణ పొందారు.మిథాని పరిశ్రమలో లైబ్రరీ నిర్వహణకు తన వంతు సహాయం అందించారు. ఉద్యోగం చేస్తూనే జనవిజ్ఞాన వేదికలో చురుకుగా పాల్గొన్నారు. బాపిరాజు సీపీఐ(ఎం)కు ఎల్లవేళ్లలా సహాయ సహకారాలు అందించారు. ఎమర్జెన్సీలో ఎన్ వి.భాస్కరరావు మొదలైన వారందరికీ అజ్ఞాతం లో ఆశ్రయం కల్పించారు. పార్టీ ఆశయాలతో చివరి వరకు సాధారణ జీవితాన్ని గడుపుతూ కార్యకర్తలు, నాయకులతో నిరంతర సంబం ధాలు కలిగి ఉండేవారు. మిథాని కంపెనీలో పని చేసేటప్పుడు కార్మికుల పక్షాన సీఐటీయూకు నాయకత్వం వహించారు.



