నవతెలంగాణ-హైదరాబాద్: నేడు మహాత్మాగాంధీ 78వ వర్థంతి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ రాజ్ఘాట్ (మహాత్ముని సమాధి)కి చేరుకుని నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఈ సందర్భంగా మహాత్మునికి నివాళులర్పించారు. అలాగే కేంద్ర రక్షణశాఖా మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రి మనోహర్లాల్ ఖట్టర్లు మహాత్మునికి నివాళులర్పించారు.
కాగా, ‘జాతిపితకు నా శతకోటి వందనాలు. బాపు ఎల్లప్పుడూ స్వదేశీకి బలమైన ప్రాధాన్యతనిచ్చారు. ఇది అభివృద్ధి చెందిన, స్వావలంబన భారతదేశం కోసం మన సంకల్పానికి ప్రాథమిక స్తంభం కూడా. ఆయన వ్యక్తిత్వం, పనులు దేశ ప్రజలను విధి మార్గంలో నడవడానికి ఎప్పటికీ ప్రేరేపిస్తూనే ఉంటాయి. మానవాళి రక్షణ కోసం బాపు ఎల్లప్పుడూ అహింసా మార్గాన్నే అనుసరించాలని చెప్పారు. ఆయుధాలు లేకుండానే ప్రపంచాన్ని మార్చగల శక్తి అందులో ఉంది. అహింస అనేది అంతిమ కర్తవ్యం. అహింస అనేది అంతిమ తపస్సు. అహింస అనేది అంతిమ సత్యం. అది ధర్మాన్ని ముందుకు తీసుకెళుతుంది’ అని మోడీ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు.




