నవతెలంగాణ-హైదరాబాద్: ఉప్పల్ వేదికగా ఆర్సీబీతో చివరి లీగ్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలకు గాను 4 వికెట్లు కోల్పోయి 255 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ(56), హెడ్(26), ఇషాన్ కిషన్(78 నాటౌట్), క్లాసెన్(51) అర్ధ సెంచరీలతో మోత మోగించారు. నితిష్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 12 బంతుల్లో 29 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఆర్సీబీ బౌలర్లు రషిక్ రెండు వికెట్లు, కృనాల్, సుయాస్, సెపెర్డ్ తలా వికెట్ తీశారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన హైదరాబాద్ బ్యాటర్లు పవర్ ప్లేలో దుమ్మురేపారు. అభిషేక్ శర్మ తనదైనశైలిలో విజృంభించాడు. ఎడాపెడా ఫోర్లు, సిక్సులు బాదుతూ పవర్ ప్లే ముగిసేరికి ఒక వికెట్ నష్టానికి 85 పరుగులతో హైదరాబాద్ పటిష్టమైన స్థితిలో ఉంది. కేవలం 20 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేశారు అభిషేక్ శర్మ.
తొలి వికెట్ రూపంలో హెడ్ ఔట్ కాగా, ఆ తర్వాత గ్రౌండ్లోకి వచ్చి ఇషాన్.. అభిషేకు తొడ్పాటు అందించాడు. అర్ధ సెంచరీ పూర్తి చేసిన తర్వాత అభిషేక్ పెవిలియన్ చేరాడు. అయిన కానీ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్లో జోరు తగ్గలేదు. ఇషాన్ తన బ్యాటింగ్కు మరింత పదును పెట్టాడు. ఈక్రమంలోనే 31 బంతుల్లో ఇషాన్ అర్ధ సెంచరీ పూర్తి చేశాడు.
మూడో వికెట్కు క్రీజులోకి వచ్చిన క్లాసెన్ తనదైన ఊపును కొనసాగించాడు. 13వ ఓవర్ వేసిన హేజీల్ వుడ్ బౌలింగ్లో ఫోర్లు, సిక్సులు మోత మోగించాడు. ఆ ఓవర్లో మొత్తం 27 రన్స్ పిండుకున్నాడు. ఇషాన్, క్లాసెన్ ధనాధన్ బ్యాటింగ్తో 15వ ఓవర్కు 209 మార్కును దాటింది హైదరాబాద్. జోరుమీదున్న క్లాసెన్ను కృనాల్ ఔట్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నితిష్.. రెండు సిక్స్ కొట్టాడు. ఇషాన్, నితిష్లు చివరి వరకు క్రీజులో ఉండి భారీ స్కోర్ దిశగా హైదరాబాద్ను నడిపించారు. 253 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఆర్సీబీ ముందుంచారు.



