- Advertisement -
నవతెలంగాణ – ఉప్పునుంతల
జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ ఉప్పునుంతల మండల కేంద్రంలో ఉపాధి కూలీలతో టీపీసీసీ ఉపాధ్యక్షులు, నాగర్కర్నూల్ డిసిసి అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ పేదలకు ఉపాధి భరోసా కల్పించేందుకే ఈ పథకం తీసుకొచ్చారని, దాన్ని నిర్వీర్యం చేసే VB-GRAMN 2025 చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం రూ.400 ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు.
- Advertisement -



