సుదీర్ఘకాలంగా సామాజిక అంశాలను కేంద్రంగా చేసుకొని వ్యాసాలు రాస్తూ సమాజాన్ని చైతన్యపరుస్తున్న ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, సోషల్ ఆక్టివిస్ట్ డా. నీలం సంపత్ గారి ‘సోషల్ పర్స్ పెక్టివ్స్’ పుస్తకావిష్కరణ సభ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో మే 31న ఆదివారం ఉదయం 10.00గంటలకు ఉంటుంది. ఈ సభలో ఎమ్మెల్సీ ప్రొ. కోదండ రామ్ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. ముఖ్య అతిథులుగా డా. కె. రామచంద్రమూర్తి, కె. శ్రీనివాస్ రెడ్డి, అల్లం నారాయణలు, గౌరవ అతిథులుగా ఎ. పుల్లయ్య, డా.ఏనుగు నరసింహారెడ్డి, ప్రొ. కూరపాటి వెంకటనారాయణలు, ప్రత్యేక అతిథులుగా సారంపల్లి మల్లారెడ్డి, ఎవివి ప్రసాద్ లు, విశిష్ట అతిథిలుగా రాజేంద్రబాబు, కోమటిరెడ్డి మోహన్ రెడ్డి, ఎం.వి. గోనారెడ్డిలు పాల్గొంటారు. సభాధ్యక్షులుగా డా.నర్రా ప్రవీణ్ రెడ్డి కొనసాగుతారు. కోట సతీష్ ఆహ్వానం పలుకుతారు. తెలంగాణ తెలుగు పరిశోధక మండలి సభను నిర్వహిస్తుంది.
డా. నీలం సంపత్ ‘సోషల్ పర్స్ పెక్టివ్స్’ పుస్తకావిష్కరణ సభ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



