నవతెలంగాణ- జన్నారం
బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలు వెళ్లి రిటర్న్ వచ్చి గ్రామాల్లో నివసిస్తున్న గల్ఫ్ కార్మికులకు ప్రభుత్వం ఉపాధి కల్పించాలని, మండలంలోని కామన్పల్లి గల్ఫ్ సంక్షేమ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జనూరి నాగరాజు అధ్యక్షులు జాడి కిరణ్ అన్నారు. శనివారం గల్ఫ్ సంక్షేమ సమితి ఆరవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, కామన్ పెళ్లి అంబేద్కర్ విగ్రహం వద్ద ఉన్న గల్ఫ్ సంక్షేమ సమితి జెండాను ఆవిష్కరించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ కార్మికుల సంక్షేమ సమితి కార్మికుల ఐక్యత కోసం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
వివిధ దేశాలలో గల్ఫ్ కార్మికులు పడుతున్న కష్టాలు ఇబ్బందుల గురించి గుర్తు చేస్తూ ప్రస్తుత ప్రభుత్వం గల్ఫ్ లో ఉన్న కార్మికులకు అండగా ఉండాలని, అలాగే (గల్ఫ్ రిటర్న్ ) స్థానికంగా ఉన్న గల్ఫ్ కార్మికులకు ఉపాధి కల్పించే విషయంలో ప్రభుత్వం సహాయం చేయాలని కోరారు.గల్ఫ్ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసినప్పటికీ నష్టపోయిన గల్ఫ్ కార్మిక కుటుంబానికి అందజేసే విధంగా ప్రభుత్వం కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు వంగాల శేఖర్, ప్రధాన కార్యదర్శి చాట్ల తిరుపతి, కార్యదర్శి జునుగురు వెంకటేష్, ముఖ్య సలహాదారులు బోర్లకుంట వెంకటేష్,జునుగురు రామన్న, సభ్యులు కొలిమికుంట్ల లక్ష్మీపతి, కందుల శ్రీను,గంధం చిన్నాన్న,కొలిమికుంట్ల సత్తన్నా, గంధం రాయలింగు, రుద్ధుల సత్తయ్య, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.



