- Advertisement -
నవతెలంగాణ – వెల్దండ
వెల్దండ మండల పరిధిలోని కోట్ర గ్రామంలో శనివారం తెలంగాణ ఉద్యమ నాయకులు గద్దర్ జయంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా చెన్నకేశవ ఆలయం వద్ద గద్దర్ చిత్రపటం ఏర్పాటుచేసి పూలమాలలు వేసి బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసిన పోరాటాలను ఉద్యమాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అల్లాజీ, సందీప్, జంగయ్య, శ్రీను, కాశన్న, చంద్రయ్య, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



