తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లోనూ వర్క్ చేసి తానేంటో ప్రూవ్ చేసుకున్నారు సినిమాట్రోగాఫర్ కిషోర్ బోయిదాప. తాజాగా ఆయన నాగబాబు ప్రధాన పాత్రలో ప్రదీప్ మద్దాలి తెరకెక్కించిన ‘మేము కాప్’లం’ సిరీస్తో మన ముందుకు వచ్చి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సిరీస్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ సిరీస్ను కేవలం 17 రోజుల్లోనే తెరకెక్కిం చటంలో కీలక పాత్రను పోషించిన కిషోర్ బోయిడాపు తన సినీ ప్రయాణం, ఎదురైన సవాళ్లు, సిరీస్కి సంబంధించిన ఎన్నో విశేషాల్ని పంచుకున్నారు. నా పూర్తి పేరు దుర్గ కిషోర్ కుమార్. 2002లో రవి ప్రసాద్ యూనిట్లో కెమెరా అసిస్టెంట్గా కెరీర్ స్టార్ట్ చేశా. తరువాత ముం బైకి వెళ్ళి మొదటి ప్రాజెక్ట్గా ‘స్లమ్ డాగ్ మిలి యనీర్’కి కెమెరా డిపార్ట్మెంట్లో పని చేశాను. ‘మిషన్ ఇంపాజిబుల్ 4’ వంటి 15 హాలీవుడ్ చిత్రాలకు కూడా చేశాను. 2012లో ‘బాయ మీట్స్ గర్ల్’ అనే సినిమాకి డీఓపీగా పని చేశా. 2015లో అనిల్ మెహతా జర్నీ స్టార్ట్ అయ్యింది. ఆ జర్నీ ‘ఏ దిల్ హై ముష్కిల్’ సినిమా నుంచి ‘జెర్సీ’ సినిమా వరకు కొనసాగింది. సింగిల్ షాట్లో సినిమా తీయడం అనేది ఛాలెంజింగ్. హన్సికతో చేసిన ‘105’ సింగిల్ కారెక్టర్తో, సింగిల్ షాట్తోనే మూవీని చేశాం. ‘‘మేము కాప్’లం’’ మొత్తం షూటింగ్ను కేవలం 17 రోజుల్లో పూర్తి చేశాం. మంచి ప్రీ-ప్రొడక్షన్ ప్లానింగ్ వల్ల, అలాగే ప్రతి డిపార్ట్మెంట్ ఎంతో కష్టపడి పనిచేసినందువల్లే అది సాధ్యమైంది. ఈ ప్రయాణంలో ఎప్పుడూ క్లారిటీతో, సపోర్ట్తో ముందుండిన డైరెక్టర్ ప్రదీప్ కి ప్రత్యేక ధన్యవాదాలు. మా మీద నమ్మకం ఉంచి ఈ ప్రాజెక్ట్కు అండగా నిలిచిన ప్రొడ్యూసర్ బీవీఎస్ రవికి, అలాగే మొత్తం ప్రొడక్షన్ టీంకి హృదయపూర్వక కృతజ్ఞతలు.ప్రస్తుతం షణ్ముక్, శివాజీ, భూమిక ‘ప్రేమకు నమస్కారం’, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలో ‘మన డాక్టర్ బాబు’ మూవీలు చేస్తున్నాను. కొన్ని సినిమాలు డిస్కషన్ స్టేజ్లో ఉన్నాయి.
అందరి సహకారంతో 17 రోజుల్లో సాధ్యమైంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



