భారీస్కోర్ దిశగా ఆంధ్ర
నాగాలాండ్తో రంజీట్రోఫీ మ్యాచ్
దీమాపూర్(నాగాలాండ్)
రంజీట్రోఫీ ఎలైట్ గ్రూప్-ఎలో ఆంధ్ర మిడిలార్డర్ బ్యాటర్ జ్ఞానేశ్వర్ అజేయ డబుల్ సెంచరీతో కదం తొక్కాడు. ఓవర్నైట్ స్కోర్ 5వికెట్ల నష్టానికి 267పరుగులతో శనివారం మూడోరోజు ఆటను కొనసాగించిన ఆంధ్రను జ్ఞానేశ్వర్(227నాటౌట్) ఆదుకున్నాడు. శశికాంత్(60), త్రిపురణ(58) అర్ధసెంచరీలతో రాణించడంతో ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్లో 9వికెట్ల నష్టానికి 536పరుగుల వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్డ్ చేసింది. అంతకుముందు నాగాలాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 366పరుగులకు ఆలౌట్ కావడంతో ఆంధ్ర జట్టుకు 170పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యతలో లభించింది. నాగాలాండ్ బౌలర్లు ఝిమోమికి ఐదు, లెమ్తూర్కు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన నాగాలాండ్ జట్టు మూడోరోజు ఆట నిలిచే సమయానికి 4వికెట్ల నష్టానికి 84పరుగులు చేసింది. టోహినో(16), కెప్టెన్ రోంగ్సేన్(0) క్రీజ్లో ఉన్నారు. ఆంధ్ర బౌలర్ త్రిపురణ విజయ్ కు మూడు, సౌరభ్ కుమార్కు ఒక వికెట్ దక్కాయి.
హిమతేజ, అభిరాత్ శతకాలు
జింఖానా గ్రౌండ్స్లో చండీగఢ్తో జరుగుతున్న ఎలైట్ గ్రూప్-డి రంజీ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు భారీ స్కోరు చేసింది. తొలి ఇన్నింగ్స్లో చండీగఢ్ను 283 పరుగులకే కట్టడి చేసిన హైదరాబాద్ బౌలర్లు.. అనంతరం తొలి ఇన్నింగ్స్లో 631పరుగులకు ఆలౌటైంది. ఓవర్నైట్ స్కోర్ 4 వికెట్ల నష్టానికి 415 పరుగులతో శనివారం ఆటను కొనసాగించిన హైదరాబాద్ను అభిరథ్ రెడ్డి (121), హిమతేజ (171), ప్రజ్ఞయ్ రెడ్డి(126) శతకాలతో రాణించారు. అమన్రావు (52) కూడా అర్ధసెంచరీతో రాణించడంతో హైదరాబాద్కు తొలి ఇన్నింగ్స్లో 348పరుగుల భారీ ఆధిక్యత లభించింది. చండీగఢ్ బౌలర్లు ఆదిత్య, ఆదిత్య సింగ్, సహబాన్ ఖాన్, ఆయుష్ పాండేకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన చండీగఢ్ జట్టు మూడోరోజు ఆట నిలిచే సమయానికి 2వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. అనుజ్ తివారి(47), అమన్దీప్(25) క్రీజ్లో ఉన్నారు. ఆ జట్టు ఇంకా 248పరుగులు వెనుకబడి ఉంది.



