- Advertisement -
ఆర్టిఐ క్యాలెండర్ ఆవిష్కరణలో కొయ్యుర్ ఎస్ఐ నరేశ్
నవతెలంగాణ – మల్హర్ రావు
సామాన్యుడు అర చేతిలో సమాచార హక్కు చట్టం ఒక వజ్రాయుధమని కొయ్యుర్ ఎస్ఐ వడ్లకొండ నరేశ్ అన్నారు. యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టిఐ క్యాలెండర్ 2026ను ఆదివారం కొయ్యుర్ పోలీస్ స్టేషన్లో ఎస్-2రాజన్ కుమార్ తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పాలనలో పారదర్శకత, జవాబుదారితనం ఉండాలని, అవినీతి నిర్మూలనకు దోహద పడుతుందని, సమాచార హక్కు చట్టం ప్రజల చేతిలో వజ్రాయుధం అన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్, ఆర్టీఐ కాటారం సబ్ డివిజన్ కన్వీనర్ చింతల కుమార్ యాదవ్, మండల సభ్యుడు రాజ సమ్మయ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



