- Advertisement -
నవతెలంగాణ – వెల్దండ
మండల పరిధిలోని పోతేపల్లి గ్రామానికి చెందిన వావిళ్ళ వెంకటయ్య అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. మృతునీ కుటుంబాన్ని కల్వకుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ మనీలా సంజీవ్ కుమార్ యాదవ్ పరామర్శించి ఓదార్చారు. మృతదేహం పై పూలమాలలు చేసి నివాళులర్పించారు. అనంతరం రూ .10 వేల ఆర్థిక సాయం అందజేశారు. కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
- Advertisement -



