- Advertisement -
పాకిస్తాన్ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం
కరాచి : ఐసీసీ టీ20 ప్రపంచకప్లో ఆడేందుకు శ్రీలంకకు బయల్దేరనున్న పాకిస్తాన్ జట్టు.. ఫిబ్రవరి 15న భారత్తో మ్యాచ్ను బాయ్కాట్ చేసింది. బంగ్లాదేశ్ను ప్రపంచకప్ నుంచి తప్పించటాన్ని తప్పుపట్టిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. గడువులోగా జట్టును ఎంపిక చేయటంతో పీసీబీ దారికొచ్చినట్టే అనుకున్నారు. కానీ ఆర్థిక ఆంక్షల నుంచి తప్పించేందుకు టోర్నీలో ఆడనున్న పాకిస్తాన్.. ఐసీసీ ఆదాయానికి గండికొట్టేందుకు భారత్తో మ్యాచ్లో ఆడమని ప్రకటించింది. ఈ మేరకు పాకిస్తాన్ ప్రభుత్వం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. కానీ బారుకాట్కు కారణాలను పాక్ ప్రభుత్వం, పీసీబీ వెల్లడించలేదు.
- Advertisement -



