జుక్కల్ లో శశస్త్ర సీమా బల్ బలగాల ప్లాగ్ మార్చ్

నవతెలంగాణ – జుక్కల్: మండల  కేంద్రంలో  జుక్కల్ ఏస్సై సత్యనారాయణ అద్వర్యంలో  కేంద్ర శశస్త్ర సీమా బల్ ప్లాగ్ మార్చ్ నిర్వహించడం జర్గింది. ఈ సంధర్భంగా నవంబర్ ముప్పైన  అసెంబ్లి   ఎన్నికల  సందర్భంగా  శాంతీభధ్రతలో బాగంగా మండల కేంద్రంలో ప్లాగ్  మార్చ్ నిర్వహించామని తెలిపారు. శాంతీ భద్రతలో అటంకం కల్గించే వారిని ఉపేక్షించేది లేదని, ఎన్నికల నిభందనల ప్రకారం ఓటర్లు , ప్రదాన పార్టీలు, అబ్యర్థులు తమ కార్యకర్తలకు సంమయమనం పాటించే విధంగా వారు అవగాహన చేయాలని, శాంతీయుతంగా ఎన్నికల నిర్వహణకు ఓటర్లు, ప్రజలు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో శశస్త్ర సీమా బల్ బలగాలు, జుక్కల్ ఎస్సై, పోలీసులు తదితరులు పాల్గోన్నారు.

Spread the love