– సర్పంచ్ బెజ్జారపు రాజేష్
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
ప్రజలు చెత్తను నిర్దిష్ట ప్రదేశాల్లోనే వేసి గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందికి సహకరించాలని సర్పంచ్ బెజ్జారపు రాజేష్ అన్నారు. సోమవారం మండలంలోని కోన సముందర్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పారిశుధ్యం పై ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టారు. అందులో భాగంగా పారిశుధ్యంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ రాకేష్ తెలిపారు. బయట గ్రామాల నుండి కూలీలను రప్పించి గ్రామంలో మురికి కాలువలను శుభ్రం చేయిస్తున్నట్లు తెలిపారు.
గ్రామాన్ని పరిశుభ్రత గ్రామంగా మార్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. గ్రామంలో ఎక్కడ కూడా చెత్త పేరుకుపోకుండా, మురికి కాలువలు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రజలు కూడా గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికులకు సహకరించి గ్రామాన్ని పరిశుభ్ర గ్రామంగా మార్చడంలో తోడ్పాటు అందించాలని కోరారు. గ్రామంలో కొన్న సాగుతున్న పారిశుధ్య కార్యక్రమాలను ఉపసర్పంచ్ భలేరావు శంకర్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ తో కలిసి సర్పంచ్ రాకేష్ పరిశీలించారు.



