- Advertisement -
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని కోన సముందర్ లో సోమవారం స్థానిక శాలివాహన యువజన సంఘం ఆధ్వర్యంలో సర్పంచ్ బెజ్జారపు రాకేష్, ఉప సర్పంచ్ భలేరావ్ శంకర్, వార్డు సభ్యులు పోతుగంటి నాగరాణి తిరుపతి దంపతులను ఘనంగా సన్మానించారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని పంచాయతీ నూతన పాలకవర్గం సభ్యులను శాలివాహన యువజన సంఘం సభ్యులు శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పి సాయి కృష్ణ, పోతుగంటి భాస్కర్, పోతుగంటి శ్రీధర్, పోతుగంటి శ్రీనివాస్, పోతుగంటి రాజు, ఎలిషాల నవీన్, ఏలిశాల భూమయ్య, మోహన్ యువజన సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



