– ఎంజీయూలో ఘటన
– జాతీయ రహదారిపై విద్యార్థుల ఆందోళన
– విచారణకు వైస్చాన్స్లర్ హామీ
నవతెలంగాణ-నార్కట్పల్లి
నల్లగొండ జిల్లా పరిధిలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో సోమవారం ఉదయం విద్యార్థుల అల్పాహార భోజనం(జీరా రైస్)లో గుట్కా ప్యాకెట్ బయటపడింది. ఈ ఘటనతో ఆరోగ్య భద్రత పెద్ద ప్రమాదంగా మారిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా అన్నంలో క్రిమికీటకాలు బయటపడినా యూనివర్సిటీ యాజమాన్యం, వైస్చాన్స్లర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గిన్నెలతో యూనివర్సిటీ మెయిన్గేట్ వద్ద బైటాయించి తీవ్ర నిరసన తెలిపారు. అనంతరం సమస్యను పరిష్కరిస్తామని వైస్చాన్స్లర్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
జీరా రైస్లో గుట్కా ప్యాకెట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



