- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ టికెట్ల కేటాయింపుపై కాంగ్రెస్ నేత జీవన్రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జగిత్యాల మున్సిపాలిటీలో టికెట్ల కేటాయింపుపై ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి ఎక్కువ టికెట్లు ఇచ్చారని మండిపడ్డారు. సంజయ్ వర్గానికి 30 సీట్లు, తన వర్గానికి 20 టికెట్లు ఇచ్చారన్నారు. ఈ చర్యతో తన మెడ కోశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు, నేతలు పెద్ద సంఖ్యలో జీవన్రెడ్డి నివాసానికి చేరుకుంటున్నారు.
- Advertisement -



