Friday, May 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం: మాజీ మంత్రి

ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం: మాజీ మంత్రి

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ : రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రజలకు మోసపూరితమైన హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పాలనపై రాష్ట్ర ప్రజలు మండిపడుతున్నారని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రాబోయేది బీఆర్ఎస్ అని అన్నారు. తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలని మండిపడ్డారు. మైథిలి ఫంక్షన్ హాల్ లో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే టిఆర్ఎస్ పార్టీ నాయకులు హనుమంత్ సిండే అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఇట్టి సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. ఈయనతో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలు బాజీ రెడ్డి గోవర్ధన్ సురేందర్ గణేష్ గుప్తా అలాగే మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ రాజు, సభ్యత్వ నమోదు కార్యక్రమానికి జుక్కల్ ఇన్చార్జిగా నియమితులైన మఠం బిక్షపతి, జుక్కల్ నియోజకవర్గంలోని టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, సర్పంచులు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పిటిసిలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో హాజరు అయ్యారు.

జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే మాట్లాడుతూ.. జుక్కల్ నియోజకవర్గం లో మొత్తం 255 ఎన్నికల బూతులు ఉన్నాయని, పార్టీ సభ్యత్వ నమోదు కోసం ఒక్కొక్క బూతుకు ఐదుగురు చొప్పున నియమించడం జరిగిందని, ప్రతి ఒక్కరు 50 మంది చొప్పున సభ్యత్వం నమోదు చేయిస్తే ఒక్కొక్క బూతుకు 250 మంది పార్టీ సభ్యత్వం నమోదు అవుతుందని, అదే లెక్క ప్రకారం 255 బూతుల్లో లెక్క వేసుకుంటే నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం 60 వేల పైన దాటుతుందని ఈ లెక్కన సభ్యత్వ నమోదు జరగాలని, నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -