- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : చెరువు ఒడ్డున ఆడుకుంటూ అందులో జారిపడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన రంగారెడ్డి (D) మహేశ్వరం (M)లో చోటు చేసుకుంది. కొత్వాల్ చెరువుతండాకు చెందిన జాటోత్ బద్రీనాథ్(8), జాటోత్ మోహన్రామ్(7), కరణ్ టోత్ శోభిత్ ముగ్గురూ స్నేహితులు ఆదివారం తండా సమీపంలోని చెరువు వద్దకు ఆడుకునేందుకు వెళ్లారు. ఈ క్రమంలో బద్రీనాథ్, మోహన్రామ్ నీటిలో పడిపోయారు. సమాచారం మేరకు అక్కడికి వచ్చిన పోలీసులు, ఈతగాళ్లతో గాలింపు చేపటారు. ఈ మేరకు సోమవారం రెండు మృతదేహాలను గుర్తించారు.
- Advertisement -



