- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ జీరో అని టీపీపీసీ చీఫ్ మహేష్గౌడ్ అన్నారు. ‘మున్సిపల్ ఎన్నికలకు BJP జాతీయ అధ్యక్షుడు రావడమేంటి? మతవిద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప ఏం చేశారు. బీజేపీ నేతల కంటే మేమే ఎక్కువ పూజలు చేస్తాం. కేంద్రబడ్జెట్లో తెలంగాణకు ఇచ్చింది సున్నా. రాష్ట్రానికి ఏమీ ఇవ్వని నేతలు ఎలా పర్యటిస్తారు. అభివృద్ధి కోసం బీజేపీ MLAలు కూడా.. మాతో కలిసి పనిచేస్తున్నారు. స్థానిక ఇన్ఛార్జ్ మంత్రులకు స్వేచ్ఛ ఇచ్చాం. కొంతమంది ఎమ్మెల్యేలు పొరపాటు చేశారు. వాటిని సరిదిద్దాలని చెప్పా’ అన్నారు.
- Advertisement -



