- Advertisement -
నవతెలంగాణ – కట్టంగూర్ : మండలంలోని కలిమెర గ్రామంలో ఉన్న పురాతన ఆంజనేయస్వామి దేవాలయం పునరుద్ధరణకు గ్రామానికి చెందిన కీ.శే. బండారు శంకరయ్య, లక్ష్మమ్మల జ్ఞాపకార్థం వారి కుమారులు బండారు విశ్వనాథం, సుదర్శన్, హనుమంతు, కృష్ణయ్య, వేణులు 40,116 విరాళాన్ని బుధవారం అందించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తోటకూరి జలజయాదయ్య, ఉపసర్పంచ్ కంభంపాటి లింగమ్మయాదయ్య, వార్డు సభ్యులు నాగోజు వెంకటాచారి, తండు గిరిబాబు, కత్తుల మహాలక్ష్మి, చింతపల్లి నరేందర్, ఉట్కూరు శంకర్, పూదోటి శశికళ, కంభంపాటి శ్రీను, చింతల బాల నర్సింహ్మ ఉన్నారు. విరాళం ఇచ్చిన వారికి గ్రామపంచాయతీ పాలకవర్గం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -



