- Advertisement -
నవతెలంగాణ – రాయికల్
మున్సిపల్ 2వ సాధారణ ఎన్నికలలో భాగంగా రాయికల్ మున్సిపాలిటీలో బూత్ లెవల్ అధికారులు, అంగన్వాడీ టీచర్లు, పట్టణ ఆర్పీలతో ఓటరు స్లిప్పుల పంపిణీపై అవగాహనా సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ కీర్తినాగరాజు, తహసీల్దార్ నాగార్జున ఓటరు స్లిప్పులు ప్రతి ఇంటికి చేరేలా చూడాలని, ఓటర్లు 18 గుర్తింపు కార్డుల్లో ఏదైనా తీసుకుని ఓటు హక్కు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



