నవతెలంగాణ-హైదరాబాద్ : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన సమావేశం నుంచి సానుకూల సంకేతాలు అందడంతో, భారత ఈక్విటీ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. 2027 ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధానికి వృద్ధి అంచనాలను ఆర్బీఐ పెంచడం మార్కెట్కు కలిసొచ్చింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 266 పాయింట్లు లాభపడి 83,580 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 50 పాయింట్లు పెరిగి 25,693 వద్ద ముగిసింది.
వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచాలన్న ఆర్బీఐ నిర్ణయంతో పాటు, స్థిరత్వానికి ప్రాధాన్యం ఇస్తామన్న సంకేతాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను బలపరిచాయి. అయితే, బెంచ్మార్క్ సూచీలకు భిన్నంగా బ్రాడర్ మార్కెట్లు మిశ్రమంగా స్పందించాయి. నిఫ్టీ మిడ్క్యాప్ 100 ఇండెక్స్ 0.02 శాతం, స్మాల్క్యాప్ 100 ఇండెక్స్ 0.27 శాతం మేర నష్టపోయాయి.



