- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : విష్వక్ సేన్ కథానాయకుడిగా కేవీ అనుదీప్ రూపొందిస్తున్న యూత్ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ ‘ఫంకీ’. కయాదు లోహర్ హీరోయిన్. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శనివారం చిత్ర ట్రైలర్ విడుదలైంది. అనుదీప్ టేకింగ్, విష్వక్ కామెడీ టైమింగ్ నవ్వులు పంచుతోంది. ప్రేమ, వినోదంతో కూడిన ఓ కుటుంబ కథతో పాటు, అన్ని వయసుల ప్రేక్షకులూ కడుపుబ్బా నవ్వుకునేలా సినిమాను తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది.
- Advertisement -



