Saturday, February 7, 2026
E-PAPER
Homeజిల్లాలుసీపీఐ(ఎం) అభ్యర్థి కొలుపుల వివేకానందను గెలిపించండి

సీపీఐ(ఎం) అభ్యర్థి కొలుపుల వివేకానందను గెలిపించండి

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
నిత్యం ప్రజా సమస్యలపై  పోరాటాలు నిర్వహించి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తున్న అభ్యర్థిని ఆదరించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర పార్టీ కార్యదర్శి జాన్ వెస్లీ, బి ఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి లు విజ్ఞప్తి చేశారు. శనివారం భువనగిరి పట్టణంలో ఆరవ వార్డు హనుమాన్ వాడ, జగ్గయ్య నగర్ లో సీపీఐ(ఎం) అభ్యర్థి కొలుపుల వివేకానంద ని గెలిపించాలని కోరుతూ భువనగిరి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికలలో ప్రచారం నిర్వహించారు. అభ్యర్థి కొలుపుల వివేకానంద గెలుపు కోసం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా  రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రసంగించారు. పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడే ఎర్రజెండను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. శ్రమజీవుల కోసం పోరాడే వ్యక్తి వివేకనంద అందరికి సుపరిచితుడు అన్నారు. 

కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్పటినుండి కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి కార్మికుల, కర్షకుల ఐక్యతను విచ్ఛిన్నం చేస్తున్నందుకు యత్నిస్తుందన్నారు. కాంగ్రెస్ 2023లో 6 గ్యారంటీ ల పేరుతో ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజలపై అనేక భారాలు మోపుతూ దేశాన్ని రాష్ట్రాన్ని కార్పొరేట్ చేతులకు కట్టబెట్టుతుందన్నారు. కార్మికుల హక్కులను కాలరాస్తున్నది కష్టజీవులు అందరు ఐక్యంగా ఉద్యమిస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. మీ వార్డులోని సమస్యలు పరిష్కరించాలంటే పేద ప్రజల గురించి తెలిసిన కమ్యూనిస్టు నాయకుడు, పట్టణంలోని సమస్యల వార్డులోని సమస్యల గురించి అధికారుల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కృషి  చేస్తాడన్నారు. కొలుపుల వివేకానంద ను గెలిపించే విధంగా ఆరోవ వార్డ్ ప్రజలందరూ కృషి చేయాలని కోరారు. చదువుకొని అనేక సమస్యలపై అవగాహన ఉన్న వివేకానందును గెలిపించి మీ సమస్యల పరిష్కారం కోసం గెలిపించాలని కోరారు. 

ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్, రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ, పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ, జిల్లా కార్యవర్గ సభ్యులు దాసరి పాండు, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్, జిల్లా కార్యదర్శి లౌడియా రాజ్, బి ఆర్ఎస్  పట్టణ అధ్యక్షులు ఏవి కిరణ్,రాష్ట్ర రైతు సమన్వయ అధ్యక్షులు కొలుపుల అమరేందర్,పట్టణ అధ్యక్షులు ఏవి కిరణ్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, మాజీ కౌన్సిలర్ తుమ్మల పాండు, బిఆర్ఎస్ పట్టణ నాయకులు ముల్కలపల్లి సత్యనారాయణ, గంటేపాక బిక్షపతి, నీలశ్రీనివాస్, సీపీఐ(ఎం) పట్టణ నాయకులు గద్దె నరసింహ, సంగు నరేందర్, గంధమల్ల మాతయ్య, వనం రాజు, బందెల ఎల్లయ్య, కల్లూరి నాగమణి, బర్ల వెంకటేష్, వోల్దాస్ అంజయ్య, చింతల శివ, సర్పంచ్ పల్లెర్ల అంజయ్య, సీపీఐ(ఎం) జిల్లా నాయకులు దయ్యాల నరసింహ, కొండమడుగు నాగమణి, గునుగుంట్ల శీను, ఎదునురు మల్లేష్, ఆరే విజయ్, అజయ్ సింగ్, పట్టణ మండల నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -