- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఏడవ వార్డు అభ్యర్థి కుక్కదువు పద్మ సోమయ్య శనివారం విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి తమను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేయడానికి ఎన్నికలను పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
- Advertisement -


