- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : వరంగల్ గడ్డపై తొలిసారిగా రాకెట్ ప్రయోగానికి రంగం సిద్ధమైంది. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఈనెల 28న హన్మకొండలో ‘రుద్రమ’ అనే మోడల్ రాకెట్ను ఆకాశంలోకి ప్రయోగించనున్నారు. ఇస్రో స్పేస్ ట్యూటర్ ATDRL, వరంగల్ నిట్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. రాకెట్ ప్రయోగంతో పాటు విద్యార్థుల కోసం అంతరిక్ష విజ్ఞాన సదస్సును కూడా ఏర్పాటు చేయడం విశేషం.
- Advertisement -



