Sunday, February 8, 2026
E-PAPER
Homeతాజా వార్తలుట్రాక్టర్‌పై నుంచి జారి కిందపడి రెండేళ్ల చిన్నారి మృతి

ట్రాక్టర్‌పై నుంచి జారి కిందపడి రెండేళ్ల చిన్నారి మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: నల్గొండ(D) తిప్పర్తి(M) వెంకటాద్రిపాలెం గ్రామంలో శనివారం విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్‌పై నుంచి జారి కిందపడి కొల్లు సైదులుగౌడ్‌-అనూష దంపతుల కుమార్తె మనస్వి (2) మృతి చెందింది. సైదులుగౌడ్‌ తన ఇంటి నుంచి ట్రాక్టర్‌లో యూరియా తీసుకొని పొలానికి వెళ్తుండగా కూతురు తానూ వస్తానని మారాం చేయడంతో ట్రాక్టర్‌పై కూర్చోబెట్టుకొని తీసుకెళ్లాడు. మార్గమధ్యలో కూతురు జామకాయ తింటూ ప్రమాదవశాత్తు జారి కిందపడింది. దీంతో ట్రాక్టర్‌ బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. అల్లారుముద్దుగా చూసుకుంటున్న కూతురు కళ్లముందే మృతి చెందడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా విలపించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -