
– రోజు రోజుకి పెరుగుతున్న బీఆర్ఎస్ బలం
– 39వ డివిజన్ నుండి బీఆర్ఎస్ లో చేరిన 400 మంది యువకులు
– ఆర్.ఆర్. చౌరస్తా రియల్ ఎస్టేట్ అసోసియేషన్ సభ్యులు 50 మంది
– గులాబీ కండువాతో స్వాగతం పలికిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ బిగాల
నవతెలంగాణ- కంటేశ్వర్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల సమక్షంలో 39వ డివిజన్ చంద్ర శేఖర్ కాలనీ కి చెందిన 400 యువకులు బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ లో సంగమే సిద్దిరామ్ టీజేఎస్ నాయకులు,షేక్ అమీర్ టీజేఎస్ నాయకులు, కావేటి సాయి బాబు టీజేఎస్ నాయకులు, లింగం రియల్ ఎస్టేట్ అసోసియేషన్, రమణ గౌడ్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్, హన్మంత్ రావు రియల్ ఎస్టేట్ అసోసియేషన్, తదితరులు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నిచెంగు లత కృష్ణ,చాంగు భాయి, షేక్ అహ్మద్, జింక అశోక్,సిర్ప రాజు, విక్రమ్ గౌడ్, సదనంద్, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.
