- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
నగరంలోని వినాయక్ నగర్ లో గల 6వ వార్డులో గల జై మాతాదీ వెల్ఫేర్ సొసైటీ సభ్యులందరూ వార్డు అభివృద్ధే తమకు ముఖ్యమని ప్రమాణం చేశారు. ఈ మేరకు జరిగిన సమావేశంలో కాంగ్రెస్ అభ్యర్థి మమత- రత్నాకర్ గౌడ్ హాజరై మాట్లాడారు. జిల్లాలో మీ కమిటీ ఆదర్శంగా నిలుస్తుందని, ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా అందరినీ చైతన్య పరుస్తున్నారని అభినందించారు. ప్రతి ఒక్క ఓటరు చైతన్యం నింపేలా ఈ కమిటీ ఆదర్శమని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు సభ్యులు పాల్గొన్నారు.
- Advertisement -



