- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కొలంబోలో జింబాబ్వే, ఒమన్ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఒమన్.. 19.5 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. వినాయక్ శుక్లా (28) టాప్ స్కోరర్. టాప్-5 బ్యాటర్లలో ఒక్కరూ రెండంకెల స్కోరు చేయలేదు. దీంతో జింబాబ్వే 27 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో వినాయక్ శుక్లా, సుఫ్యాన్ మెహమూద్ (25) ఆరో వికెట్కు 42 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తొమ్మిదో స్థానంలో వచ్చిన నదీమ్ ఖాన్ (20) పరుగులు చేశాడు. జింబాబ్వే బౌలర్లలో ముజారబానీ (3/16), రిచర్డ్ నగరవ (3/10), బ్రాడ్ ఎవాన్స్ (3/18) సత్తా చాటారు.
- Advertisement -



