Tuesday, February 10, 2026
E-PAPER
Homeజాతీయంసీషెల్స్‌ అధ్యక్షుడు పాట్రిక్‌ హెర్మినీతో మోడీ భేటీ

సీషెల్స్‌ అధ్యక్షుడు పాట్రిక్‌ హెర్మినీతో మోడీ భేటీ

- Advertisement -

ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో సమావేశం

న్యూఢిల్లీ : సోమవారం ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో ప్రధాని మోడీ సీషెల్స్‌ అధ్యక్షుడు పాట్రిక్‌ హెర్మినీతో సమావేశమయ్యారు. పర్యటనలో భాగంగా ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ని సందర్శించిన ఆయన మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. ఈ పర్యటన కోసం హెర్మినీ ఆదివారమే ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన రాజధానికి చేరుకోకముందు చెన్నై, ముంబయిలలో పర్యటించారు. ఫిబ్రవరి 10 వరకు ఆయన భారత్‌ పర్యటన కొనసాగనుంది. కాగా, సీషెల్స్‌ భారత్‌కు కీలకమైన సముద్ర పొరుగుదేశం. అలాగే భారత్‌ విజన్‌ మహాసాగర్‌, గ్లోబల్‌ సౌత్‌ దేశాలలో నిబద్ధతగల ముఖ్యమైన భాగస్వామి సీషెల్స్‌నేనని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వశాఖ ఎక్స్‌లో పోస్టు చేసింది. ఈ పర్యటన సందర్భంగా సీషెల్స్‌ దేశాధ్యక్షుడు పాట్రిక్‌ హెర్మెనీ, ప్రధాని మోడీ ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించుకోనున్నారు. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరు నేతలు అభిప్రాయాలను ఈ భేటీలో పంచుకోనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -