- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం సాయంత్రం భారీ గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులకు గ్రౌండ్ సపోర్టింగ్ పరికరాలు ఎగిరి, పార్క్ చేసి ఉన్న మూడు ఎయిరిండియా విమానాలను బలంగా ఢీకొట్టాయి. దీంతో విమానాలు దెబ్బతిన్నాయి. అధికారులు అప్రమత్తమై, దెబ్బతిన్న విమానాల సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసి, తనిఖీలకు పంపించారు. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణకు ఆదేశించింది.
- Advertisement -



