- Advertisement -
రైతు కమిషన్ చైర్మెన్తో బృంద సభ్యుల భేటీ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
అన్ని పంటలకు మద్దతు ధర, చట్టభద్రత కల్పించాలని కోరుతూ రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 7న కన్యాకుమారిలో ప్రారంభమైన ‘రైతు జాగృతి యాత్ర’ శనివారం రాష్ట్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా రైతు కమిషన్ చైర్మెన్ కోదండరెడ్డి, విత్తనాభివృద్ధి చైర్మెన్ సుంకేట అన్వేష్రెడ్డి, రైతు నేత నల్లమల వెంకటేశ్వరరావుతో యాత్ర బృంద సభ్యులు సమావేశమయ్యారు. రైతు సమస్యలపై చర్చించారు. మార్చి 19న ఢిల్లీ రాంలీలా మైదానంలో ముగింపు బహిరంగ సభ నిర్వహిస్తామని రైతు జాగృతి యాత్ర చైర్మెన్ జగజిత్ సింగ్ డల్లేవాలా ఈ సందర్భంగా తెలిపారు. రైతులు పండించిన అన్ని పంటలకు మద్దతు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
- Advertisement -



