- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
గ్రామాల అభివృద్ధిలో గ్రామపంచాయతీ వార్డు సభ్యుల పాత్ర కీలకంగా ఉండాలని డోంగ్లి మండల ఎంపీడీవో జగదీష్ అన్నారు. డోంగ్లి మండలంలోని గ్రామపంచాయతీలో వార్డు సభ్యులకు మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో గత మూడు రోజులుగా శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. ఈ శిక్షణ తరగతులు ఈనెల 20న ముగియనున్నాయి. ఈ సందర్భంగా వార్డు సభ్యుల శిక్షణ తరగతుల్లో ఎంపీడీవో పాల్గొని వార్డు సభ్యులకు, గ్రామాల అభివృద్ధి గురించి వివరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు ఈనెల 16 నుండి శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొంటున్నారు.
- Advertisement -



