నవతెలంగాణ – మిడ్జిల్
వ్యవసాయ పొలం దగ్గర నుండి గుర్తు తెలియని దుండగులు ట్రాక్టర్ను ఎత్తుకెళ్లిన సంఘటన బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఎస్సై శివ నాగేశ్వర్ నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన శ్రీనివాసులు తన వ్యవసాయ పొలంలో మంగళవారం ట్రాక్టర్ను పొలం వద్ద ట్రాక్టర్ను వదిలి ఇంటికి వచ్చాడు. బుధవారం తెల్లవారుజామున పొలం దగ్గరికి వెళ్లి చూడగా ట్రాక్టరు కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో గుర్తుతెలియని వ్యక్తులు టాక్టర్ను తీసుకెళ్లినట్లు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివనాగేశ్వర్ నాయుడు తెలిపారు. మండలంలో వరుస దొంగతనాలు జరుగుతుండడంతో రైతులు, ప్రజలు ఆందోళనకు గురి అవుతున్నారు.
ట్రాక్టర్ ను ఎత్తుకెళ్లిన దుండగులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


