- Advertisement -
నవతెలంగాణ – వెల్దండ
జేఈఈ మెయిన్ -2026 మొదటి విడత పరీక్ష ఫలితాల్లో తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ కల్వకుర్తి కి చెందిన విద్యార్థులు మెరుగైన ఫలితాలను సాధించారు. జేఈఈ (అడ్వాన్స్ డ్ ) పరీక్షలో ఫలితాలలో 10 మంది విద్యార్థులు అర్హత సాధించారని ప్రిన్సిపాల్ సుమన్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ కోడం భాస్కర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఉత్తమ ప్రతిభ సాధించారు .కొర్ర సాయి చరణ్ 84.62 పర్సంటైల్, ఇస్లావత్ రాజశేఖర్ 78.66, కేతావత్ మోహన్ 78.29, ముడావత్ గణేష్ 75.26 లతోపాటి 10 మంది జేఈఈ (అడ్వాన్స్ డ్ ) మెయిన్స్ లో విద్యార్థులు అర్హత సాధించారు . సిటీ సాధించిన విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు.
- Advertisement -


