- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని రెడ్ బుక్ డే సందర్భంగా స్థానిక సీపీఐ(ఎం) కార్యకర్తలు ప్రజా సంఘాల నాయకులు ఆదివారం పుస్తక పఠన కార్యక్రమం నిర్వహించినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 1848లో ఫిబ్రవరి 22వ తేదీన ప్రపంచ కమ్యూనిస్టు మేనిఫెస్టోను ఆమోదించడం జరిగింది. కావున ఈ రోజునే రెడ్బుకు డే గా జరుపుతూ ఒక రోజు అయినా ఒక పుస్తకం పైన చదివి అవగాహన తెచ్చుకోవాలని ప్రజా సంఘాలు నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్, డివిజన్ కమిటీ నాయకులు టి భూమన్న, జక్కం సుజాత, యట కానుకయ్య, శ్రవణ్ కుమార్, నవీద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -

