- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఉత్తరప్రదేశ్లోని బహ్రైచ్లో విద్యాశాఖలో ఘోర అవినీతి వెలుగుచూసింది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా ఇవ్వాల్సిన 13,500లకు పైగా నూతన పాఠ్యపుస్తకాలను సిబ్బందే కిలో రూ.4కు తుక్కు వ్యాపారికి అమ్మేశారు. వీటిని కంటైనర్లో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు ముగ్గురు ఉద్యోగులను డిస్మిస్ చేయగా, ఇద్దరిని సస్పెండ్ చేశారు. ఉన్నతాధికారులపై కూడా విచారణకు సిఫార్సు చేశారు.
- Advertisement -



