- Advertisement -
నవతెలంగాణ-బెజ్జంకి
కుల అహంకారంతో రజకులపై దాడి చేసి చిన్నారి మృతికి కారకులైన వారిని ప్రభుత్వం గుర్తించి శిక్షించాలని మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద మండల రజక సంఘం అధ్వర్యంలో మంగళవారం నిరసన చేపట్టారు. మృతి చెందిన చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని రజక సంఘం మండలాధ్యక్షుడు దీటీ రాజు కోరారు. అయా కుల, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -



