కేరళ సీఎం విజయన్తో నటుడు మోహన్లాల్ ఫేస్ టు ఫేస్
రిలీజైన నిమిషంలోనే సోషల్ మీడియాలో వైరల్
తిరువనంతపురం: కేరళలో దశాబ్ద కాలంగా అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ సర్కార్ ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్య క్రమాలను చేపట్టింది. తమ హయాంలో సాధించిన అభివృద్ధితో పాటు ప్రజాపరిపాలనను కేరళ ప్రజానీ కానికి తెలియజేయటానికి ‘ఇరువర్’ టీజర్ను విడుదల చేసింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్తో నటుడు మోహన్ లాల్ ముఖాముఖితో విడుదలైన ఈ టీజర్ నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. విస్తృత ప్రశంసలు అందు కుంది. ”ప్రజల హృదయాలను తాకిన ఇద్దరు వ్యక్తులు” అనే ట్యాగ్లైన్తో ఉన్న ఈ టీజర్ ”రెండు వారసత్వాలు” అనే పదబంధంతో ప్రారంభమవు తుంది. వీరి మధ్య స్నేహ పూర్వక సంభాషణలో ఇది సాగుతుంది. టీజర్ యొక్క ముఖ్యాం శాలలో ఒకటి మోహన్ లాల్ అడిగిన ఆసక్తికరమైన ప్రశ్న: ”ముఖ్య మంత్రికి ఇష్టమైన సినిమా రజనీకాంత్ చిత్రాలలో ఒకటి అని నా స్నేహితుడు చాలా రహస్యంగా నాకు చెప్పాడు. మీకు యాక్షన్ సినిమాలు ఇష్టమా?”నవ్వుతూ .. ముఖ్యమంత్రి తాను నిజంగా యాక్షన్ చిత్రాలను ఆస్వాదిస్తానని చెప్పారు. మోహన్ లాల్ మాటలతో టీజర్ భావోద్వేగంతో ముగుస్తుంది: ”నా కేరళ, మీ కేరళ, మా కేరళ.” ప్రస్తుతం టీజర్ విడుదలైంది. ఇంటర్వ్యూ పూర్తి వెర్షన్ ఫిబ్రవరి 26న విడుదల కానుంది.
కేరళ పాలనపై ఇరువర్ టీజర్ విడుదల
- Advertisement -
- Advertisement -



