- Advertisement -
నవతెలంగాణ – సుల్తాన్ బజార్
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్స్ కు క్యాష్ లెష్ ట్రీట్మెంట్ (ఈ హెచ్ ఎస్) ఆరోగ్య భీమా అమలుకు ఆమోదం తెలిపినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాబర్ట్ బ్రూస్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ హెచ్ ఎస్ సమస్యను ప్రభుత్వ ద్రుష్టి కి తీసుకెళ్లి సమస్యను పరిష్కరానికి కృషి చేసిన తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఛైర్మెన్ వి.లచ్చిరెడ్డి ఇతర ఉద్యోగ సంఘ నాయకులందరికి ధన్యవాదములు తెలిపారు. పెండింగ్ డి ఏలు, పి ఆర్ సి ని పరిష్కారించాలని కోరటం జరిగింది అన్నారు.
- Advertisement -



