- Advertisement -
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మెన్గా కె. శ్రీనివాసరెడ్డి పదవీకాలాన్ని మరో రెండేండ్లు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు బుధవారం జీవో నెంబరు 289ని సమాచార శాఖ ఎక్స్అఫిసియో ప్రత్యేక కార్యదర్శి సిహెచ్.ప్రియాంక విడుదల చేశారు. అకాడమీ చైర్మెన్ పదవీకాలం మంగళవారంతో ముగియడంతో పొడిగింపు అవసరమైంది. జీవో రాగానే చైర్మెన్ శ్రీనివాస్రెడ్డి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
- Advertisement -



