- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో మురికి కాలువల నిర్మాణం సిసి రోడ్ల నిర్మాణం చేపట్టాలని కాలనీలో మురికి కాలువలు లేక నిలిచిపోతున్న మురికి నీటిని తొలగించే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆ కాలనీకి చెందిన పలువురు కార్యదర్శి సందీప్ కుమార్ కు ఒక వినతి పత్రాన్ని అందజేశారు. హౌసింగ్ బోర్డ్ కాలనీ ప్రజలు ఇంటి పన్ను కడ్తలేరా నీటి పన్ను కడ్తలేరా అన్ని రకాల టాక్స్లు వసూలు చేస్తున్నప్పటికీ కాలనీ సమస్య పట్టించుకోవడంలో నిర్లక్ష్యం ఎందుకని ఆ యువకులు సభలో ప్రశ్నించారు. ఏది ఏమైనా మా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. వినతిపత్రాన్ని అందజేశారు.
- Advertisement -


