నవతెలంగాణ-హైదరారాబాద్: అయోధ్య రామమందిర్ విరాళాల స్కాంలో దర్యాప్తు కమిషన్ గడువును పొడిగించారు. విరాళాల అవకతవకల పై సమగ్ర విచారణ కోసం 15 రోజులకు పెంచారు. కాగా, రామమందిర విరాళాల దుర్వినియోగం ఆరోపణలకు సంబంధించిన కేసులో నిందితులందరినీ అయోధ్య కోర్టు జూన్ 29న 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. శ్రీరామ జన్మభూమి ఆలయానికి సంబంధించిన ఆర్థిక అవకతవకలు, నిధులు, కానుకల దుర్వినియోగంపై ఉత్తరప్రదేశ్ పోలీసులు జరిపిన తీవ్ర స్థాయి దర్యాప్తు నేపథ్యంలో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. రామమందిర విరాళాల దుర్వినియోగం నేపథ్యంలో ప్రతిపక్షాలు ఆందోళనలు వ్యక్తం చేశాయి. దీంతో శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, సభ్య ట్రస్టీ అనిల్ మిశ్రా శుక్రవారం తమ పదవులకు రాజీనామా చేశారు.
రామమందిర్ విరాళాల స్కాం..సిట్ గడువు పొడిగింపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



