- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఇంగ్లండ్తో జరిగిన మూడో టీ20లో 125 పరుగుల తేడాతో ఓటమిపై భారత క్రికెట్ జట్టు ముఖ్య కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించారు. జట్టు మార్పు దశలో ఉందని, యువ ఆటగాళ్లకు సమయం ఇవ్వాలని అన్నారు. ఆటగాళ్లలో గేమ్ అవేర్నెస్ లోపించిందని, సాంకేతిక లోపాల కంటే ఇదే ప్రధాన సమస్య అని గంభీర్ విశ్లేషించారు. మూడో టీ20లో 76 పరుగులకే ఆలౌట్ అయినా, ఆటగాళ్లపై నమ్మకం కోల్పోలేదని, ఇది జట్టు బలహీనత కాదని, ఆగ్రెసివ్ క్రికెట్ ఆడుతున్నప్పుడు ఇలాంటి రోజులు సహజమని పేర్కొన్నారు.
- Advertisement -



