- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: మహారాష్ట్రలోని పింప్రి చించ్వాడ్ పరిధిలోని మోషి ప్రాంతంలో ఒక భవనం కూలిపోయిందని అధికారులు బుధవారం తెలిపారు. శిథిలాల కింద సుమారు 13 నుండి 14 మంది చిక్కుకుని ఉండవచ్చని పింప్రి చించ్వాడ్ అగ్నిమాపక శాఖ పేర్కొంది. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



