- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: మహారాష్ట్ర సతారాలో దారుణం జరిగింది. కరెంట్ షాక్ తో ఒకే కుటుంబలో నలుగురు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సతీష్ షిండే అనే వ్యక్తి ఇంట్లో లైట్ బల్బును అమర్చుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురయ్యారు. ఆయనను కాపాడే ప్రయత్నంలో ఆయన భార్య ,ఇద్దరు పిల్లలు కూడా విద్యుత్ ఘాతానికి గురై, నలుగురూ మరణించారు. వీరంతా ఖమ్గావ్లోని సఖర్వాడి నివాసితులని పోలీసులు తెలిపారు. మృతులను పిసురాద్య కిసాన్ షిండే, గంగు సతీష్ షిండే, సచిన్ సతీష్ షిండే ఆర్తి సతీష్ షిండేగా పోలీసులు గుర్తించారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -



